Thursday, July 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా వాహనాలు తనిఖీలు

మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా వాహనాలు తనిఖీలు

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట 
మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా మండల వ్యాప్తంగా బుధవారం  వాహనాల తనిఖీలను పస్రా ఎస్సై కమలాకర్ ముమ్మరంగా నిర్వహించారు. మావోయిస్టు పార్టీ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు  మొదలుకావడంతో పస్రా పోలీస్‌ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి జిల్లాలోకి ప్రవేశించే మార్గాల్లో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా మావోయిస్టులు తమ ఉనికి కోసం ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా కట్టడి చేయాలనే లక్ష్యంతో తనిఖీలు ముమ్మరం చేశారు.

ఇతర ప్రాంతాల నుంచి జిల్లాలోకి ప్రవేశించే అనుమానితులపైనా పోలీసులు నిఘా పెట్టారు. వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టులు ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడకుండా సరిహద్దుల్లోని పోలీస్‌స్టేషన్ల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పి  డాక్టర్ శబరిష్ ఐపీఎస్ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నామని పస్రా ఎస్సై కమలాకర్ అన్నారు  అపరిచితులకు ఆశ్రయం కల్పించవద్దని ప్రజలకు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -