భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ ఓటీటీ ఫ్లాట్ఫామ్ జీ5 ఈ ఏడాది మరో సూపర్హిట్ సిరీస్తో ప్రేక్షకులను అలరిస్తోంది. ‘సంక్రాంతికి వస్తున్నాం, రాబిన్హుడ్, భైరవం’ వంటి వరుస తెలుగు సూపర్హిట్లను అందించిన తర్వాత జీ5 తెలుగు ఇప్పుడు మరో అద్భుతమైన సిరీస్ను అందించింది. శరవణన్ ప్రధాన పాత్రలో నటించిన ‘సట్టముం నీతియుం’ సిరీస్ను జీ5
తెలుగు ప్రేక్షకులకు అందించి మరో విజయాన్ని సొంతం చేసుకుంది. 18 క్రియేటర్స్ బ్యానర్ మీద ఈ సిరీస్ను శశికళ ప్రభాకరణ్ నిర్మించారు. షో రన్నర్గా సూర్య ప్రతాప్.ఎస్ వ్యవహరించారు. బాలాజీ సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్ తెలుగులో రీసెంట్గా స్ట్రీమింగ్ అయి మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ‘సట్టముమ్ నీతియుమ్’ సక్సెస్ మీట్ను మంగళవారం ఘనంగా నిర్వహించారు.
నిర్మాత శశికళ మాట్లాడుతూ, ‘నిర్మాతగా ఇలా స్టేజ్ మీద మాట్లాడుతుండటం కొత్తగా ఉంది. యాంకర్గా ఎన్నోసార్లు మైక్ పట్టుకున్నా కూడా ఈ రోజు ఇలా కొత్తగా అనిపిస్తోంది. ఇదంతా కూడా నా భర్త ప్రభాకరణ్ వల్లే సాధ్యమైంది. ఈ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్ను ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన అందరికీ థ్యాంక్స్. తెలుగులోనూ ఈ సిరీస్ అద్భుతంగా దూసుకుపోతోంది. బాలాజీ ఈ సిరీస్ను కేవలం 13 రోజుల్లోనే పూర్తి చేశారు. ఆయన వల్లే ఈ సిరీస్ ఇంత అద్భుతంగా వచ్చింది. ఆర్ట్ డైరెక్టర్ భావన మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. శరవణన్ ఈ సిరీస్కు బ్యాక్బోన్లా నిల్చున్నారు. నమ్రత ప్రస్తుతం చాలా బిజీగా మారిపోయారు. ఈ సిరీస్లో అందరూ అద్భుతంగా నటించారు. నా భర్త ప్రభాకరణ్కు సిరీస్లు, సినిమాల పట్ల ఎంతో ప్యాషన్ ఉంటుంది. ఆయనకు ఈ ప్రాజెక్ట్ చాలా ప్రత్యేకం. ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియెన్స్కు థాంక్స్’ అని అన్నారు.
‘నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నా నిర్మాతలు, జీ5 టీంకు థ్యాంక్స్. నా ఫస్ట్ హీరో శరవణన్. అందరూ ఈ సిరీస్ను చూసి ఎంజారు చేస్తున్నారు. అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ వస్తుండటం ఆనందంగా ఉంది’ అని బాలాజీ సెల్వరాజ్ చెప్పారు. జీ5 తమిళం, మలయాళం బిజినెస్ సౌత్ హెడ్ లాయిడ్ జేవియర్ మాట్లాడుతూ, ‘ఈ సిరీస్ బ్లాక్బస్టర్గా నిలిచింది. పది రోజుల్లోనే వంద మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ను దాటేసింది. 13 రోజుల్లోనే ఇంత మంచి సిరీస్ను తెరకెక్కించడం మామూలు విషయం కాదు. పబ్లిక్ డిమాండ్ వల్లే ఈ సిరీస్ను ఇతర భాషల్లోకి డబ్ చేశాం’ అని తెలిపారు. ‘తమిళంలో ఈ సిరీస్ బ్లాక్ బస్టర్ అయింది. తెలుగులోనూ అంతే రెస్పాన్స్ వస్తోంది. ఈ సిరీస్ను సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు’ అని ప్రభాకరణ్ అన్నారు.
తెలుగులోనూ విశేష ప్రేక్షకాదరణ
- Advertisement -
- Advertisement -