- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమాను శనివారం లాంఛనంగా ప్రారంభించారు. దిల్ రాజు నిర్మాణంలో రవి కిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం మాస్ యాక్షన్, రూరల్ డ్రామా నేపథ్యంలో సాగనుంది. హైదరాబాద్లో జరిగిన ప్రారంభ వేడుకకు కీర్తి సురేష్ హాజరుకావడంతో ఆమెనే హీరోయిన్గా నటిస్తుందని ఊహాగానాలు బలపడ్డాయి. రాయలసీమ బ్యాక్డ్రాప్లో సాగే ఈ సినిమాపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
- Advertisement -