- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ చైతన్యవంతమైన నేల అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానత్వం సాధించేలా ‘తెలంగాణ రైజింగ్ విజన్-2047’ డాక్యుమెంట్ రూపొందించినట్లు చెప్పారు. సమిట్ ముగింపు వేడుకలో ప్రసంగిస్తూ.. ‘‘2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఎదగాలనే లక్ష్యం పెట్టుకున్నాం. అన్ని వర్గాలవారిని సంప్రదించి.. పేదలు, రైతులు, వ్యాపారులు, యువతకు అభివృద్ధి ఫలాలు దక్కేలా విజన్ డాక్యుమెంట్ను రూపొందించాం’’ అని తెలిపారు.
- Advertisement -



