నవతెలంగాణ – కమ్మర్ పల్లి : వేల్పూర్ మండల కేంద్రంలో ఆదివారం స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు జరాభిషేకాలు చేశారు. గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు గోదావరి నుంచి తీసుకొచ్చిన గంగాజలాలను డప్పు చప్పుల మధ్య ఊరేగింపుగా వెళ్లి గ్రామదేవతలకు జలభిషేకాలు చేసి, నైవేద్యాలను సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వేల్పూర్ గ్రామంలో ఆనాటి నుండి ఈనాటి వరకు గ్రామ దేవతలకు గంగ జలాలతో అభిషేకం చేసి నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఆనవాయితీలో భాగంగా గ్రామ దేవతలకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి, జలాభిషేకాలు చేసినట్లు వివరించారు. గ్రామంతో పాటు ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు, గుడ్డు గోదా సుభిక్షంగా ఉండాలని గ్రామదేవతలను కోరుకున్నట్లు తెలిపారు. ఊరేగింపు సందర్భంగా పోతరాజుల విన్యాసాలు గ్రామస్తులను అకట్టుకున్నాయి.
వేల్పూర్ లో గ్రామ దేవతలకు జలాభిషేకాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES