- Advertisement -
- – జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్
నవతెలంగాణ – మల్హర్ రావు - పదవతరగతిలో వందశాతం ఉత్తీర్ణ సాధించేలా ప్రణాలికను తయారు చేసుకోవాలని భూపాలపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ సూచించారు. గురువారం మండలంలోని ఎడ్లపల్లి మోడల్ స్కూల్ ను సందర్షించారు. ఈ సందర్భంగా విద్యార్థుల, ఉపాధ్యాయులు రోజువారి రికార్డులు తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం పెడుతున్నారాని అడిగి తెలుసుకున్నారు. సెలబస్ ఎంత వరకు పూర్తియిందని ఉపాధ్యాయులను అడిగి తెలుకున్నారు. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ పదిలో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్స్ పాల్ పూర్ణచందర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
- Advertisement -



