సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండశ్రీశైలం
నవతెలంగాణ – చండూరు : అంతపేట గ్రామంలో ఉన్న నిరుపేదలకు ఇంటి స్థలం ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. గురువారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో గతంలో నిరుపేదలకు ఇచ్చిన భూమిని ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరుతూ ఆర్డిఓ శ్రీదేవికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ..గతంలో అంతపేట గ్రామంలో నిరుపేదల ఇండ్ల స్థలాలకు సర్వేనెంబర్ 6/ఉ లో పట్టాలు ఇచ్చారని, తమ భూమి దగ్గరికి లబ్ధిదారులు వెళ్తే అధికారులు అడ్డగిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 1999 సంవత్సరంలో అంతంపేట గ్రామంలో ఇండ్లు లేని నిరుపేద ప్రజలకు ఆనాటి ప్రభుత్వం గుర్తించి 150 మందికి పట్టా సర్టిఫికెట్ ఇచ్చారని గుర్తు చేశారు. ఆనాటి ప్రభుత్వం తమ గ్రామంలో గుడిసెలు వేసుకుంటే అప్పటి ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చి మర్చిపోయారన్నారు. నిరుపేదలకు పట్టాలు ఇచ్చి, ఆ స్థలంలో మౌలిక వసతులు లేకపోవడం వలన ఇండ్ల నిర్మాణం చేయలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నలపరాజు రామలింగయ్య, చండూరు సీపీఐ(ఎం) మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ, గట్టుప్పల సిపిఐ మండల కార్యదర్శి భీమనపల్లి రమేష్, , గ్రామ శాఖ కార్యదర్శి అయితరాజు లక్ష్మయ్య, గూడెం నరసింహ, పెంటయ్య, సీపీఐ(ఎం) అంతంపేట నాయకులు తెలుసూరి సైదులు, మాధగోని కోటమ్మ, సత్తమ్మ నరసింహ, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
ఇంటి స్థలం ఇచ్చి ఇండ్లు నిర్మించి ఇవ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES