– వ్యవసాయంలో సాంకేతిక విజ్ఞానాన్ని అలవర్చుకోవాలి..
– వ్యవసాయ శాస్త్ర వేత్తలు శివరామన్, శాలిని, శ్రీనివాస్, పిసి మీనా..
నవతెలంగాణ – తొగుట: లాభసాటి వ్యవసాయమే లక్ష్యంగా కేంద్ర ప్రభు త్వం వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని వ్యవసాయ శాస్త్ర వేత్తలు (నార్మా) పిసి మీనా, శివ రామన్, రమేష్ నాయక్, (సిఅర్ఐడిఎ) శాలిని, (కేవికే, టీయుఎన్ ఐకేఐ) శ్రీనివాస్ లు పేర్కొన్నారు. ఆదివారం విక సిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని వెంకట్రావుపేట రైతు వేదికలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా లు ఉమ్మడి లక్ష్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వ్యవసాయం రోజు రోజుకు వొస్తున్న మార్పులకు అనుగుణంగా రైతులకు మెలుకువలు అందించి వ్యవసాయ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాల న్నారు. ఏం కిసాన్ సైట్ లో మీ మొబైల్ నెంబర్ యాడ్ చేసుకోవడం ద్వారా వారం రోజుల వాతావరణ పరిస్థితులు ముందుగానే తెలుసుకునే అవకాశం ఉందన్నారు. హరిత విప్లవం మూలంగా రసాయన ఎరువులు విచక్షణ రహితంగా వాడటం అలవాటు కావడం తో భూసారం దెబ్బతినడంతో పాటు రోగాల బారి న పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయం లో సేంద్రియ వ్యవసాయం కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు. రైతు ఉత్పత్తి సంఘాల ద్వారా రైతులకు మరిన్ని సేవలు అందిస్తామని అన్నారు. సాంప్రదాయ వరి, పత్తి, మొక్క జొన్న స్థానంలో వాణిజ్య పంటలు సాగుచేయాల న్నారు. మండల వ్యవసాయాధికారి మోహన్ మాట్లాడుతూ రైతులు ప్రతి ఒక్కరు భూసార పరీ క్షలు చేసుకోవాలని, తద్వారా పోషక లోపాలను సరిచేసుకుంటే మెరుగైన దిగుబడులు సాధిస్తా మని సూచన చేశారు. ఈ సందర్బంగా రైతుల సందేహాలకు వారు సమాధానం చెప్పారు. కార్య క్రమంలో ఎఫ్పీసి చైర్మన్ జీడిపల్లి రాంరెడ్డి, ఏఇఓ సాయి కుమార్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
లాభసాటి వ్యవసాయం కోసం కృషి చేయాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES