- Advertisement -
స్నేహితుడి కుటుంబానికి చేయూత ..
నవతెలంగాణ – మునుగోడు
చండూరు మండలంలోని కొండాపురం గ్రామానికి చెందిన గడ్డం మహేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఆదివారం మునుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2002,2003 ఎస్ ఎస్ సి బ్యాచ్ కి చెందిన తోటి స్నేహితులు మహేష్ కుటుంబానికి 45 వేల సహాయంను అందజేసి తోటి స్నేహితుడికి అండగా నిలిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుటుంబానికి అండగా ఉండాల్సిన మహేష్ అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని అన్నారు. వారి కుటుంబానికి ఎలాంటి ఆపద వచ్చిన అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
- Advertisement -