నవతెలంగాణ – జన్నారం: ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లను అందజేస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. బుధవారం జన్నారంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. నిరుపేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ వైస్ చైర్మన్ పసియుల్లా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముజాఫర్ అలీ ఖాన్ ప్రధాన కార్యదర్శి మేకల మాణిక్యం తాసిల్దార్ రాజ మనోహర్ రెడ్డి ఎంపీడీవో ఉమర్ షరీఫ్ , పిఎసిఎస్ చైర్మన్ అల్లం రవి, నాయకులు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముత్యం సతీష్, మోహన్ రెడ్డి సుభాష్ రెడ్డి ఇసాక్, మామిడిపల్లి ఇందయ్య రమేష్, మచ్చ
శంకరయ్య, కరుణాకర్ షాకీర్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లిస్తాం: ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES