Thursday, June 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పేదల సొంతింటి కళ నెరవేరుస్తాం..

పేదల సొంతింటి కళ నెరవేరుస్తాం..

- Advertisement -

పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి 
చిన్న వయస్సులో పెద్ద బాధ్యత అప్పగించారు
పట్టాల పంపిణీలో భావోద్వేగానికి లోనైన ఎమ్మెల్యే 
నవతెలంగాణ – పెద్దవంగర
: రాష్ట్రంలోని పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక రైతు వేదికలో నిర్వహించిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ఎమ్మెల్యే పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాలకుర్తి ప్రజలు తనకు చిన్న వయసులోనే పెద్ద బాధ్యతను అప్పగించారని భావోద్వేగానికి లోనయ్యారు. పేదవాడి గూడులేని లోటు తీరుస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. పార్టీలకతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేసామని తెలిపారు. పేద ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం అని, ప్రతి గడపకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడానికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో వేణుమాధవ్, మండల వ్యవసాయ అధికారి గుగులోత్ స్వామి నాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హమ్యా నాయక్, మండల ఇంచార్జి విజయ్ పాల్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రంగు మురళి గౌడ్, ప్రధాన కార్యదర్శి పొడిశెట్టి సైదులు, ఏఎంసీ డైరెక్టర్ బానోత్ గోపాల్ నాయక్, ముత్యాల పూర్ణచందర్, తోటకూరి శ్రీనివాస్, నగేష్, రాజు, హరికృష్ణ, ఎండీ జాను, చిలుక దేవేంద్ర, బెడద మంజూల, సోమన్న, వెంకన్న, పంచాయతీ కార్యదర్శి రమేష్, ఏఈవోలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -