Friday, June 20, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఆలస్యమైనా ప్రతి హామీ అమలుచేసి తీరుతాం: మంత్రి పొంగులేటి

ఆలస్యమైనా ప్రతి హామీ అమలుచేసి తీరుతాం: మంత్రి పొంగులేటి

- Advertisement -


తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార , రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ – తుర్కపల్లి
: శవాల మీద పేలాలు ఏరుకునే విధంగా ప్రతిపక్ష నాయకులు రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ రెవిన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారుల మంజూరి ఉత్తర్వుల పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని సభ అధ్యక్షుడు ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్లు ఐలయ్యతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఈ సందర్భంగా 227 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాటల మాంత్రికుడు గత సీఎం కేసీఆర్ వాసాలమర్రిని దత్తత తీసుకొని ఆగం చేశారని అన్నారు. ఈనెల ఆరవ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆలేరు నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య వాసాలమర్రి గ్రామ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకురావడంతో గత ప్రభుత్వంలో మాజీ సీఎం వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకొని ఆగం చేశారని ,ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోరడంతో గ్రామంలో ఉన్న లబ్ధిదారులందరికీ, పేదవారికి చిరకాల కోరిక తీర్చడానికి ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చి కల నెరవేర్చడం జరిగిందని అన్నారు.

అర్ధాంతరంగా నిలిచిపోయిన స్కూల్ భవనాలను సిసి రోడ్లను పూర్తి చేస్తామని అన్నారు. ఎంతమంది అర్హులున్న అందరికీ ఇందిరమ్మ ఇండ్లను ఇస్తామని అన్నారు. ఆనాటి సీఎం మోసం చేసిన విషయం అందరికీ తెలుసని వాసాలమర్రి దత్తత తీసుకొని గ్రామాన్ని రోల్ మోడల్ గా చేస్తానని అదేవిధంగా రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేస్తానని అన్నారని గ్రామాన్ని అభివృద్ధి చేయనోడు రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారని అన్నారు . ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బొమ్మను చూపించి ఓట్లు వేయించుకొని పేదవాడి కలను బొమ్మలకే పరిమితం చేశారని అన్నారు. చివరికి ఒక చిన్న గ్రామానికి కూడా ఒక ఇల్లు కట్టించలేక పోయాడని అన్నారు .ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు 6500 కోట్లు అసలు, మిత్తి కడుతున్నామని అన్నారు. 200 యూనిట్ల ఉచిత కరెంటు, మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచితం, 500 కే సిలిండర్, 10 లక్షల ఆరోగ్య శ్రీ బీమా పథకం, పేదవాడికి సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగిందని అన్నారు.

పేదింటి విద్యార్థులకు 40% మిస్ చార్జీలు, 200 శాతం కాస్మటిక్ చార్జీలను పెంచినట్లు తెలిపారు. తెలంగాణ లో 22,500 కోట్ల తో మొదటి విడత నిధులను మంజూరు చేసి 20 లక్షల ఇళ్లను కట్టడమే లక్ష్యమని అన్నారు. 400 నుండి 600 చదరపు గజాల్లో నిర్మించుకోవాలని నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలను అందజేయనున్నట్లు తెలిపారు। రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగోలేకున్న పేదోడి ఇంటికలను సహకారం చేయాలని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. ధరణి తీసుకువచ్చి రాష్ట్రాన్ని గత ప్రభుత్వం ఆగం చేసిందని ప్రజలు ఆగం కావద్దని భూభారతి చట్టంతో అందరికీ పూర్తి భద్రత, న్యాయం 2025 చట్టాన్ని తీసుకురావడం జరిగిందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని ఇది ఒక అద్భుతమైన చట్టమని మీ సమస్యలను మీ గ్రామానికి వచ్చి పరిష్కరించే చట్టం చుట్టం లాంటిదని అన్నారు. పలు మండలాల్లో, జిల్లాల్లో 1000 మందికి పైగా సర్వేయర్లను నియమిస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వం పేదోడికి అండగా, భరోసాగా ,పక్షపాతి ధోరణితో అన్ని విధాలుగా పాలన చేస్తున్నామని అన్నారు. చెప్పిన మాటలను ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతామని అన్నారు. గత ప్రభుత్వం తప్పులను ఒప్పులుగా సోషల్ మీడియా వాడుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అన్యాయం చేశారని అన్నారు. అందుకే ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. 

అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతున్న ప్రతిపక్ష నాయకులు: ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

We will implement every promise, even if it is delayed: Minister Ponguleti

గత ప్రభుత్వం పదేళ్లలో ఏ ఒక్క పేదవాడికి ఒక్క ఇల్లు నిర్మించలేదని, ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు తెలియడంతో పాటు శవాల మీద పేలాలు చేరుకునే రాజకీయం చేశారని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. వాసాలమర్రిలో ఆయన మాట్లాడుతూ వాసాలమర్రి గ్రామానికి కేసీఆర్ చేసిన గాయానికి సీఎం రేవంత్ రెడ్డి మందు పెడుతున్నారని అన్నారు. వాసాలమర్రిని బంగారు వాసాలమర్రిగా చేస్తానని బంగాళాఖాతంలో పడేశారని అన్నారు. మూఢనమ్మకాల పిచ్చోడు చేసిన పనికి గ్రామమంతా బలైపోయిందని అన్నారు. గ్రామంలో అభివృద్ధి తో పాటు అర్హులందరికీ ఇందిరమ్మ ఇండను ఇస్తామని అన్నారు. ఈరోజు లబ్ధిదారులకు ఉత్తర్వుల పత్రాలను అందజేయడం సంతోషంగా ఉందని, నాలుగు నెలల్లో ఇండ్లను పూర్తి చేసుకోవాలని అన్నారు. గత ప్రభుత్వంలో గ్రామాల్లో ఒక్క డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కూడా ఇవ్వలేదని అన్నారు.

రాష్ట్రంలో 4 లక్షల 50 వేల మందికి ఇండ్లను ప్రభుత్వం అందజేస్తుందని, అందులో 3500 ఇండ్లను ఆలేరు నియోజకవర్గం కేటాయించడం జరిగిందని అన్నారు. వాసాలమర్రి గ్రామానికి 227 ఇండ్లను ప్రత్యేకంగా మంజూరు చేయడం జరిగిందని అన్నారు. విద్యార్థులను, నిరుద్యోగులను అందరిని గత ముఖ్యమంత్రి ఆగం చేశాడని గ్రామంలో స్కూలు, ఇండ్లను కూలగొట్టి ఫామ్ హౌస్కే పరిమితమైనాడని అన్నారు. యాదగిరిగుట్ట లో రోడ్డు బాధితులకు, ఆటో డ్రైవర్లకు ఎలాంటి ఉపాధి కల్పించలేకపోయారని అన్నారు. గత ప్రభుత్వంలో వాసాల మరిలో 450 ఏళ్లకు పత్రాలు ఇచ్చారు కానీ ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నియోజకవర్గానికి 1500 కోట్లతో అభివృద్ధి పనులు తెస్తే ప్రతిపక్ష నాయకులు ఓర్వలేక పోతున్నారని అన్నారు. గంధ మల్ల గ్రామంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. ఐదు సంవత్సరాల్లో ఏ ఊర్లో ఇల్లు లేని వాళ్లు ఉండొద్దని ఇందిరమ్మ పాలన లక్ష్యమని అన్నారు. ఆలేరును రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి ఉన్నంతవరకు తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రతిపక్ష నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తూ, చిల్లర మాటలు మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. కెసిఆర్ పాలన వాసాలమర్రి గ్రామమే నిదర్శనమని అన్నారు.

గత ప్రభుత్వం మాటల ప్రభుత్వమే కాని చేతల ప్రభుత్వం కాదని అన్నారు. రైతులందరికీ రైతు భరోసా అందజేస్తామని ఎలాంటి సమస్యలు ఉన్న అధికారులను సంప్రదించాలని అన్నారు. పది ఏళ్లలో చేయని అభివృద్ధిని 18 నెలల్లో చేస్తుంటే ప్రతిపక్ష నాయకులు ఓర్వలేక అసూయ పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి ,జిల్లా కలెక్టర్ హనుమంతరావు ,అడిషనల్ కలెక్టర్లు వీరారెడ్డి ,భాస్కరరావు, ఆర్డిఓ కృష్ణారెడ్డి, మదర్ డైరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, టీపీసీసీ కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, తాసిల్దార్ దేశ్యనాయక్, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ధనావత్ శంకర్ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ చాడ భాస్కర్ రెడ్డి, అన్ని శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బాబు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -