నవతెలంగాణ-హైదరాబాద్: యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు అల్ఖైదా అధిపతి నుంచి బెదరింపు సందేశం వచ్చింది. ట్రంప్తో పాటు అతని మంత్రివర్గాన్ని హతమర్చుస్తామంటూ అల్ఖైదా అధిపతి సాద్ బిన్ అతేఫ్ అల్-అవ్లా హెచ్చరించాడు. గాజాలో పాలస్తీనా వాసులకు.. ఎటువంటి ఆధారం మిగల్చలేదని.. అందుకే ఈ స్థాయిలో దాడులు చేయాలని పిలుపునిచ్చాడు. ఈ మేరకు 34 నిమిషాల వీడియోలో పేర్కొన్నాడు. గాజాలో జరుగుతున్న మారణహోమానికి ప్రతీకారంగా మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించాడు. 2024, మార్చిలో సాద్ బిన్ అతేఫ్ అల్-అవ్లా అల్ఖైదా అధిపతిగా ఎన్నికయ్యాడు. అతడి తలపై అమెరికా 6 మిలియన్ డాలర్ల రివార్డును ప్రకటించింది.
అల్ఖైదాను ఒసామా బిన్ లాడెన్ స్థాపించాడు. 2009లో ఇది స్థాపించబడింది. యెమెన్లో ఉన్న ఒక ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్ ఇది. జిహాద్ పేరుతో అల్ఖైదా మారణహోమం సృష్టిస్తోంది. అల్ ఖైదా ఉగ్రవాదులు చాలా ప్రమాదకరమైన వాళ్లు. గత కొంతకాలంగా అలఖైదా యెమెన్ నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తోంది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా అల్ ఖైదా పరిగణించబడింది. అమెరికా, దాని మిత్ర దేశాలను అల్ ఖైదా పదే పదే బెదిరిస్తూ ఉంటుంది. ఇక నిఘా వర్గాలు కూడా అల్ ఖైదా తీరును ఎప్పటికప్పుడు అంచనా వేస్తూనే ఉంటారు.