Saturday, June 7, 2025
E-PAPER
Homeకరీంనగర్పేదల సంక్షేమం కాంగ్రెస్ నైజం..

పేదల సంక్షేమం కాంగ్రెస్ నైజం..

- Advertisement -

నవతెలంగాణ – తంగళ్ళపల్లి
పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ నైజాం అని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం తోనే మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జ్ఞాపకాలు పదిలంగా ఉన్నాయని కాంగ్రెస్ మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగం గౌడ్ అన్నారు. శుక్రవారం తంగళ్ళపల్లి మండలం లోని ఇందిరమ్మ కాలని,జిల్లెల్ల లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు కాంగ్రెస్ నాయకులు భూమి పూజ నిర్వహించారు.జిల్లెళ్ల లో పెద్దమ్మ దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు.కాంగ్రెస్ సీనియర్ నాయకులు నర్ర బాలరెడ్డి గత కొన్ని రోజులుగా అనారోగ్య కారణంగా బాధపడుతున్న ఆయన ను కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. గ్రామానికి చెందిన తౌటి తిరుపతి రూ.60వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, ఆరే బాలు, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి సత్తు శ్రీనివాస్ రెడ్డి,అసరి బాలరాజు, మనోజ్, ఉమేష్,తిరుపతి గౌడ్, నర్సయ్య,సలీం పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -