చిరంజీవి నటిస్తున్న నూతన చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో చిరుతో వెంకటేష్ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇరువురి ఫ్యాన్స్కి బిగ్గెస్ట్ ట్రీట్ కానుంది. తాజాగా వెంకటేష్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయిందని తెలియజేస్తూ.. సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టు పెట్టారు. ‘మన శంకర వర ప్రసాద్ గారు సినిమా కోసం నా భాగం ఈరోజుతో పూర్తయ్యింది. ఇది ఎంతో అద్భుతమైన అనుభవం! నాకు ఎంతో ఇష్టమైన మెగాస్టార్ చిరంజీవితో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా అనిపించింది. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎంతోకాలంగా ఎదురుచూశాను. ఆ అవకాశాన్ని ఈ ప్రత్యేకమైన సినిమాతో ఇచ్చినందుకు డైరెక్టర్ అనిల్ రావిపూడికి హదయపూర్వక ధన్యవాదాలు. మనం అందరం కలిసి 2026 సంక్రాంతిని థియేటర్స్లో ఘనంగా సెలబ్రేట్ చేద్దాం’ అని పేర్కొన్నారు.
వెంకటేష్ పోస్ట్కి చిరంజీవి రిప్లై ఇస్తూ ఒక ప్రత్యేకమైన పోస్ట్ పెట్టారు. ‘మై డియర్ వెంకీ, మై బ్రదర్ .. మనిద్దరం కలిసి పనిచేసిన ఈ పది రోజులు నాకు మెమరబుల్. నీతో గడిపిన ప్రతి క్షణం ఆనందంతో, ఎనర్జీతో నిండిపోయింది. ఈ చిత్రానికి నువ్వు ఇచ్చిన ప్రత్యేకమైన ప్రజెన్స్ అబ్బురపరిచింది. నీతో గడిపిన ప్రతి క్షణం ఎంతో ఆనందం కలిగించింది’ అని తెలిపారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ‘కొన్ని కలలు మన మనసులో సంవత్సరాల పాటు దాగి ఉంటాయి. అకస్మాత్తుగా సినిమా అలాంటి కలలను నిజం చేస్తుంది. మెగాస్టార్, వెంకటేష్తో పక్కపక్కన నిలబడి, కలిసి నవ్వుతూ, డ్యాన్స్ చేస్తూ, వారి ప్రత్యేకమైన చార్మ్తో మెరిసిన ఆ క్షణం నిజంగా మాటల్లో చెప్పలేనంత ఆనందం ఇచ్చింది. నా ప్రయాణంలో ఇది ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నాను’ అని స్పందించారు.
కల నిజమైన వేళ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



