– వారు పూర్తికాలం సమాజం కోసమే పని చేశారు : టాప్రా కార్యాలయం
– ప్రారంభ సభలో ఎస్ వీరయ్య
– క్రమంగా తగ్గుతున్న పెన్షన్, ప్రభుత్వ విధానాలే కారణం : మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి
– మోడీ కార్పొరేట్ల బంటు :శ్రీకుమార్
– పెన్షనర్లంటే మోడీకెందుకంత నిర్లక్ష్యం?
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పెన్షనర్లంటే మోడీకంత నిర్లక్ష్యమేంటని నవతెలంగాణ పూర్వ సంపాదకులు ఎస్ వీరయ్య ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్లో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (టాప్రా) ఆధ్వర్యంలో ‘టాప్రా భవన్’ను ఏఐసీసీఈపీఎఫ్పీఏ చైర్మెన్ ఎంఎన్రెడ్డి ప్రారంభించారు. దీనికి ముందు జాతీయ జెండాను మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, సంఘం జెండాను టాప్రా సీనియర్ నాయకులు ప్రభాకర్ నాయర్ ఆవిష్కరించారు. టాప్రా ఉపాధ్యక్షులు యు ఆంజనేయులు, ఏఐఎస్జీఈఎఫ్ సెక్రెటరీ జనరల్ శ్రీకుమార్ లిప్ట్, మీటింగ్ హాల్ను ప్రారంభించారు. టాప్రా అధ్యక్షులు పి నారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో వీరయ్య మాట్లాడుతూ మార్కెట్ వ్యవస్థలో లాభమే ప్రధానమైందని చెప్పారు. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలు రిటైరైన ఉద్యోగులు కరివేపాకులాంటి వారని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. వారికిచ్చే పెన్షన్ వృధా పెట్టుబడి అని భావించటం దుర్మార్గం కాక మరేమిటని ప్రశ్నించారు. సోషలిస్టు దేశమైన చైనాలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందన్నారు. తమ జీవిత కాలంలో సమాజానికి వారు చేసిన సేవ లాభాపేక్షే పరమావధిగా భావించే సర్కార్లకు వీరి బాధలు పట్టవని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే టాప్రా ఏర్పాటుకు ఒక ప్రత్యేకత ఉందని చెప్పారు. సమాజంలో ఉన్న పెన్షనర్లందరినీ ఐక్యం చేయాలని ఆలోచిస్తున్నదన్నారు. సమస్యల పరిష్కారానికి పోరాటాలు తప్పవని ఆ సంఘం భావిస్తున్నదని వివరించారు.
అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ పెన్షనర్లకు క్రమంగా పెన్షన్ తగ్గు తుందని చెప్పారు. దీనికి ప్రభుత్వ విధానాలే కారణమని తెలిపారు. సమాజానికి సేవ చేసిన వారికి మంచి జీవితాన్ని ఇవ్వాలనే లక్ష్యం ఈ సర్కార్లకు లేదని విమర్శించారు. అందరికోసం పని చేసే సంఘం టాప్రా మాత్రమేనని అన్నారు. అంతరాల విద్య బలోపేత మవుతుందనీ, దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఎన్రెడ్డి, శ్రీకుమార్, ప్రభాకర్ నాయర్, టాప్రా ప్రధాన కార్యదర్శి పి కృష్ణమూర్తి, సీఐటీయూ కార్యదర్శి జె వెంకటేశ్, యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి వెంకట్, ఎస్టీఎఫ్ఐ నాయకురాలు సంయూక్త, కాన్ఫడరేషన్ అధ్యక్షులు నాగేశ్వరరావు తదితర సంఘాల నేతలు మాట్లాడారు.
పెన్షనర్లంటే మోడీకెందుకంత నిర్లక్ష్యం?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES