Saturday, June 14, 2025
E-PAPER
Homeజాతీయంఎందుకు అరెస్ట్‌ చేశారు?

ఎందుకు అరెస్ట్‌ చేశారు?

- Advertisement -

జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును విడుదల చేయాలి
పాత్రికేయ స్వేచ్ఛను కాపాడాలి : ఏపీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశం
బెయిల్‌ మంజూరు చేసిన అత్యున్నత న్యాయస్థానం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

చర్చావేదికలో ప్యానల్‌ సభ్యుడు చేసిన వ్యాఖ్యలకు టెలివిజన్‌ యాంకర్‌ను ఎందుకు అరెస్టు చేశారని ఏపీ పోలీ సులను అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును విడుదల చేయాలని స్పష్టం చేసింది. పాత్రికేయ స్వేచ్ఛను కాపాడా ల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. పాత్రికేయ హక్కులు, వాక్‌ స్వాతంత్య్రానికి ఆయన ప్రాథమిక హక్కును కాపాడాల్సిన అవసరం ఉంద ని పేర్కొంది. తాను హౌస్ట్‌ చేసిన టెలివిజన్‌ షోలో ఒక ప్యానెలిస్ట్‌ చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలకు సంబం ధించి ఏపీ పోలీసులు అరెస్టు చేసిన జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు (కెఎస్‌ఆర్‌) కు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. తన అరెస్టు, రిమాండ్‌ను సవాల్‌ చేస్తూ జర్నలిస్టు కెఎస్‌ఆర్‌ దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూ ర్తులు జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ మన్మోహన్‌ లతో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్‌ తరపున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ దవే వాదనలు వినిపిస్తూ ఆ వ్యాఖ్యలు పిటిషన్‌దారుడు చేయలేదని, ఒక ప్యానెలిస్ట్‌ చేశా డని ధర్మాసనం దృష్టికి దష్టికి తీసుకెళ్లాడు. దీనికి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా జోక్యం చేసుకుని ఈ కేసు నావికా, సర్దేశారు కేసు లాంటిదని అన్నారు. స్పందించిన న్యాయ వాది సిద్ధార్థ్‌ దవే ఖచ్చితంగా అలాంటి కేసేనని ఏకీభ వించారు. మరొకరు చేసిన ప్రకట నలకు పిటిషనర్‌ను ఎలా అరెస్టు చేస్తారని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ”వేరొకరు ఆ వ్యాఖ్య చేశారు. అలాంటప్పుడు పిటిషనర్‌ అరె స్టు ఎలా సాధ్యం?” అని రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గిని జస్టిస్‌ మన్మోహన్‌ ప్రశ్నించారు. దీనికి ముకుల్‌ రోహత్గిని జోక్యం చేసుకుని ”ఆ వ్యాఖ్యలు చేస్తున్న వ్యక్తిని పిటిషనర్‌ రెచ్చగొట్టి ప్రోత్సహిం చారు. ఆయన నవ్వారు” అని అన్నారు. దీనికి జస్టిస్‌ మన్మోహన్‌ బదులిస్తూ ”ఎవరైనా దారుణమైన వ్యాఖ్యలు చేసినప్పుడు, మనం దానిని నవ్వి తిరస్కరిస్తాం. వారిని సహా కుట్రదారులు అని చెప్పలేం” అని అన్నారు. జస్టిస్‌ మిశ్రా కూడా జోక్యం చేసుకుని ప్రతిరోజూ ఇది జరుగుతోందన్నారు. దీనికి స్పందించిన ముకుల్‌ రోహత్గి ”ఆయన ప్రేక్షకుడు కాదు. ఆయన అదే ఛానెల్‌లో భాగం” అన్నారు. వెంటనే జస్టిస్‌ మిశ్రా స్పందిస్తూ ఆయన అలాంటి వ్యాఖ్య చేయలేదు అని అన్నారు. దీనికి ముకుల్‌ రోహత్గి బదులిస్తూ ”ఆయన ఆ వ్యక్తిని రెచ్చగొడుతున్నాడు. ఇది సెక్స్‌ వర్కర్ల రాజధాని వంటి అంశా లని అన్నారు” అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మరో సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ్‌ లూత్రా జోక్యం చేసుకుని ఈ ప్రకటన కేవలం పరువు నష్టం కలిగించేది మాత్రమే కాదని, లైంగిక అంశంలో ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో ఉందని చెప్పారని వాదించారు. హైకోర్టు ఆయన బెయిల్‌ పిటిషన్‌ పెండింగ్‌లో ఉందని తెలిపిందని అన్నారు. అయితే, ఆ ప్రకటన ఆయన చేయలేదని పరిగణనలోకి తీసుకుని, ఆయనను విడుదల చేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
”పిటిషనర్‌ 70 ఏండ్ల వయస్సు గల సీనియర్‌ జర్నలిస్టు. ఆయన సాక్షి టీవీలో లైవ్‌ విత్‌ కెఎస్‌ఆర్‌ షోను ప్రదర్శిస్తున్నారు. ఆయన తన అరెస్టు, రిమాండ్‌ను సవాల్‌ చేశారు. పిటిషనర్‌ జూన్‌ 6న టీవీ షోను నిర్వహించి నప్పుడు ప్యానెలిస్టులో ఒకరు పరువు నష్టం కలిగించే ప్రకటన చేశారు. పిటిషనర్‌ దానికి అభ్యంతరం చెప్పలేదని, బదులుగా నవ్వుతూ కనిపించారని వాదించారు. పాల్గొనే వారిలో ఒకరు చేసిన ప్రకటనతో పిటిషనర్‌ ఎక్కడా ఆందో ళన చెందలేదని పేర్కొన్నారు. నవ్వుతూ, మౌన ప్రేక్షకుడిగా ఉండటంతో నేరాన్ని ప్రోత్సహించారని వాదించారు. పిటిషనర్‌ స్వయంగా అలాంటి ప్రకటన చేయలేదు. ఆయన పాత్రికేయ హక్కులను కాపాడాలి, తద్వారా ఆయన వాక్‌ స్వేచ్ఛ కూడా రక్షించబడుతుంది. కాబట్టి ట్రయల్‌ కోర్టు విధించే షరతులకు లోబడి పిటిషనర్‌ను విడుదల చేయా లని ఆదేశిస్తున్నాం. అలాగే తన షోలో ఎలాంటి అవమానక రమైన ప్రకటనలు చేయవద్దు. మరెవరూ అదే విధంగా చేయడానికి అనుమతించవద్దు” అని ఆర్డర్‌లో పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -