- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మహిళలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని మద్నూర్ మండల తహశీల్దార్ ఎండి ముజీబ్ అన్నారు. శనివారం ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా తహశీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహించే మహిళలను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు అంటే తల్లి అక్కా చెల్లె లాంటివారని, వారిని ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా గౌరవించాలని కోరారు, ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ శ్రీ రామకృష్ణ, ఆర్ ఐ శంకర్, కార్యాలయ అధికారులు, జిపిఓలు కార్యాలయ సిబ్బంది మహిళ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



