- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్: మద్నూర్ మండలంలోని సోమూర్ గ్రామాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు గురువారం సందర్శించారు. సర్పంచ్ ఎన్నికలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆ గ్రామస్తులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సంగ్రామ్ గలప్వార్ గెలిపే ధ్యేయంగా పట్టుదలతో పని చేయాలని నాయకులను కార్యకర్తలను కోరారు గ్రామం చిన్నదైనా ఓట్లు తక్కువగా ఉన్నందున ఎదుటివారికి తక్కువగా అంచనా వేయకుండా గెలుపే ముఖ్యంగా పట్టుదలతో పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ సింగిల్ విండో మాజీ చైర్మన్ కొండ గంగాధర్, సోమూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పాల్గొన్నారు.
- Advertisement -



