నవతెలంగాణ-హైదరాబాద్ : మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ బ్యాటింగ్ ముగిసింది. నిర్ణిత 50 ఓవర్లకు భారత్ ఏడు వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేసి దక్షిణాఫ్రికా ముందు 299 భారీ లక్ష్యాన్ని ఉంచింది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రెండు గంటలు ఆలస్యంగా మొదలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఓపెనర్ షెఫాలీ వర్మ (87; 78 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీ చేసే ఛాన్స్ మిస్ చేసుకుంది. ఆల్రౌండర్ దీప్తి శర్మ (58; 58 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), స్మృతి మంధాన (45; 58 బంతుల్లో 8 ఫోర్లు) రాణించారు. చివర్లో రిచా ఘోష్ (34; 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడుగా ఆడింది. జెమీమా రోడ్రిగ్స్ (24), హర్మన్ప్రీత్ కౌర్ (20), అమన్జ్యోత్ కౌర్ (12) తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో అయబొంగా ఖాకా 3, మ్లాబా, క్లో ట్రయాన్, నడిన్ డి క్లెర్క్ ఒక్కో వికెట్ తీశారు.
IND Vs SA: ప్రపంచ కప్ ఫైనల్..దక్షిణాఫ్రికా లక్ష్యం 299
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



