– లేకుంటే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్కు ఓటేయొద్దు : బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజు యాదవ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
యాదవ, కురుమలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజు యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సామాజిక న్యాయం ఏడో గ్యారంటీ అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందన్నారు. అధికారంలోకి రాగానే యాదవ, కురుమలకు రూ.రెండు లక్షలు అకౌంట్లలో వేస్తామని హామీ ఇచ్చిందని చెప్పారు. 60 ఏండ్ల చరిత్రలో యాదవ, కురుమలు లేని తొలి క్యాబినెట్ ఇదేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో పైసలిస్తేనే పదవులిస్తున్నారని ఆరోపించారు. బొమ్మ మహేష్కుమార్గౌడ్ కాదనీ, బిల్లా మహేష్కుమార్గౌడ్గా మారిపోయారని చెప్పారు. కురుమ సీఎం సిద్ధరామయ్య ను తెచ్చి బీసీ డిక్లరేషన్ను ప్రకటించారని గుర్తు చేశారు. ఆయనతోనే యాదవ, కురుమలకు అన్యాయం చేశారని అన్నారు. యాదవ, కురుమలకు మంత్రివర్గంలో అవకాశమివ్వకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓట్లేయొద్దని కోరారు. మంత్రిపదవులు ఎందుకు రావడం లేదో ఎంపీ అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
యాదవ, కురుమలకు మంత్రివర్గంలో అవకాశమివ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES