- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపల్ పరిధిలో ఓ యువతీయువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బిహార్కు చెందిన కార్మికుడి ఇద్దరు కుమార్తెలు స్థానిక బిస్కెట్ పరిశ్రమలో పని చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం తండ్రి ఇంటికి రాగా లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. కిటికీలోంచి చూడగా ఓ గదిలో కుమార్తెతో పాటు మరో గుర్తుతెలియని యువకుడి మృతదేహాలు కనిపించాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. యువకుడు అమ్మాయిని హత్యచేసి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.
- Advertisement -



