- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్: తెలంగాణ అవతరణ దినోత్సవ సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ యువ కెరటాలు కవి సమ్మేళనంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన యువకులు పాల్గొని తమ కవితలలో తెలంగాణ వైభవాన్ని చాటిచెప్పారు. జి. రామ్ స్మృతికి ఏ టేల్ ఆఫ్ వ్యాలర్ శీర్షిక ఆంగ్లంలో కవిత వినిపించగా, రమావత్ కిరణ్ తెలంగాణ విజయాలు , ఇంద్రావత్ రాహుల్ నాయక్ తెలంగాణ మట్టి మనుషులు శీర్షికలతో తెలుగు కవితలు వినిపించారు. చైతన్యవంతమైన కవిత్వాన్ని వినిపించిన యువకులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అభినందించి సత్కరించారు.
- Advertisement -