- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్:బాంబు బెదిరింపు మెయిల్స్ పంపిన యువతిని ఆర్జీఐఏ పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. చెన్నైకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ రినే జోషిదా (30) ఓ టేకిని ప్రేమించింది. పెళ్లికి అతను అంగీకరించకపోవడంతో కోపంతో గత 7 నెలలుగా దేశవ్యాప్తంగా సుమారు 11 ఎయిర్పోర్టులు, పలు స్కూళ్లకు బాంబులున్నాయంటూ ప్రియుడికి సంబంధించిన మెయిల్తో సందేశాలు పంపింది. ఈ మెయిల్స్ను కేంద్ర దర్యాప్తు అధికారులు తీవ్రంగా పరిగణించి రినే జోషిదాను అరెస్ట్ చేశారు.
- Advertisement -