Saturday, January 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యువత స్వయం ఉపాధి మార్గాలు ఎంచుకోవాలి 

యువత స్వయం ఉపాధి మార్గాలు ఎంచుకోవాలి 

- Advertisement -

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు 
వీ ఆర్ ఫ్యామిలీ మార్ట్ ప్రారంభం
నవతెలంగాణ – భూపాలపల్లి

యువత స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకుని ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సూచించారు. శుక్రవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన వీ ఆర్ ఫ్యామిలీ మార్ట్(పీపుల్స్ స్టోర్) ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్ట్ నిర్వాహకులు ఉన్నారు.

చర్చి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే..
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డు కారల్ మార్క్స్ కాలనీలో రూ.10 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న కల్వరి గాస్పర్ చర్చ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అన్ని మతాలూ సమాజానికి శాంతి, ఐక్యత, సేవా భావాన్ని బోధిస్తాయన్నారు. ప్రజల ఆధ్యాత్మిక అవసరాలను తీర్చే విధంగా చర్చి నిర్మాణం జరగడం ఆనందకరమని అన్నారు. మత సామరస్యాన్ని కాపాడటం సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.

దైనందినిని ఆవిష్కరించిన ఎమ్మెల్యే..
భూపాలపల్లి కారల్ మార్క్స్ కాలనీలోని శ్రీ సాయిబాబా ఆలయంలో నూతనంగా ముద్రించిన దైనందినిని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సాయిబాబా బోధనలు సమాజానికి శాంతి, సేవా భావం, మానవత్వాన్ని ప్రసాదిస్తాయని అన్నారు. దైనందిని ద్వారా భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు, పూజా విధానాలు మరింత చేరువవుతాయని తెలిపారు. భక్తి, నైతిక విలువలు పెంపొందే కార్యక్రమాలకు తమ పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.

సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని క్రిష్ణకాలనీ లోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై, జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి ఎంతో అవసరమని తెలిపారు. చిన్న వయసులోనే క్రీడల్లో ప్రతిభను వెలికితీసేలా ఇలాంటి పోటీలు దోహదపడతాయన్నారు. క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, మౌలిక వసతులపై ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమాలలో  ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -