- Advertisement -
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: యువత చెడు అలవాట్లు వైపు కాకుండా శాంతి మార్గంలో ప్రయాణించాలని చౌటుప్పల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.మన్మధ కుమార్ అన్నారు.శుక్రవారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని రన్ ఫర్ యూనిటీ అనే కార్యక్రమాన్ని విద్యార్థులతో నిర్వహించారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు యువత శాంతి వైపు ప్రయాణించినప్పుడే పట్టుదల కోసి కృషితో ఏదైనా సాధించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్లు యాదగిరి ఉపేందర్ రెడ్డి అజయ్ భార్గవ్ తదితరులు పాల్గొన్నారు
- Advertisement -

 
                                    