Saturday, November 15, 2025
E-PAPER
Homeతాజా వార్తలుయూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌

యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌

- Advertisement -

త్రినాధ్‌ కఠారి హీరోగా, ఆయన స్వీయ దర్శకత్వంలో సంజీవని ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై నిర్మాత బళ్లారి శంకర్‌ నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఇట్లు మీ ఎదవ’. సాహితీ అవాంచ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వెయ్యేళ్ళు ధర్మంగా వర్ధిల్లు అనేది ట్యాగ్‌ లైన్‌. ఇటీవల రిలీజైన ట్రైలర్‌కి వచ్చిన మంచి రెస్పాన్స్‌తో సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ సినిమా ఈనెల 21న విడుదల కానుంది. నైజాంలో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ ఎల్‌ఎల్‌పి విడుదల చేయనుండగా, ఆంధ్ర, సీడెడ్‌లో ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ రిలీజ్‌ చేయనుంది. ఈ రెండు ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో సినిమా విడుదల కానుంది. దీంతో సినిమాపై సర్వత్రా భారీ క్రేజ్‌ ఏర్పడింది.

‘ఓ భిన్న కాన్సెప్ట్‌తో రూపొందిన ఈచిత్రం తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది. మా చిత్రాన్ని మైత్రి, ప్రైమ్‌షో సంస్థలు రిలీజ్‌ చేసేందుకు ముందుకు రావడం హ్యాపీగా ఉంది’ అని మేకర్స్‌ తెలిపారు. త్రినాధ్‌ కఠారి, సాహితీ అవాంచ, తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్‌, నవీన్‌ నేని, సురభి ప్రభావతి, మధుమణి, తాగుబోతు రమేష్‌, చలాకీ చంటి, జబర్దస్త్‌ నూకరాజు, జెమినీ సురేష్‌, డీడీ శ్రీనివాస్‌, రామజగన్‌ తదితరులు నటించిన ఈచిత్రానికి రచన, దర్శకత్వం: త్రినాధ్‌ కటారి, నిర్మాత: బళ్లారి శంకర్‌, డీవోపీ: జగదీష్‌ చీకటి, సంగీతం: ఆర్‌.పి.పట్నాయక్‌, ఎడిటర్‌: ఉద్ధవ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: మల్లికార్జున్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: బంధావన్‌ కేతిరెడ్డి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -