Friday, June 6, 2025
E-PAPER
Homeజాతీయంపంజాబ్‌లో యూట్యూబర్‌ అరెస్టు

పంజాబ్‌లో యూట్యూబర్‌ అరెస్టు

- Advertisement -

ఐఎస్‌ఐకు గూఢచర్యం చేస్తున్నాడని ఆరోపణలు
చండీగఢ్‌ :
పాకిస్తాన్‌ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌ (ఐఎస్‌ఐ)కు గూఢచర్యం చేస్తున్నాడనే ఆరోపణలపై పంజాబ్‌కు చెందిన జస్బీర్‌ సింగ్‌ అలియాస్‌ జాన్‌ మహల్‌ (41)ను పోలీసుల అరెస్టు చేశారు. జస్బిర్‌ సింగ్‌ ‘జాన్‌ మహల్‌’ అనే యూట్యూబ్‌ను నిర్వహిస్తున్నాడు. దీనికి పదిలక్షలమందికిపైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. జస్బిర్‌ సింగ్‌ 2024లోనే పాకిస్తాన్‌కు మూడుసార్లు వెళ్లాడని అధికారులు వెల్లడించారు. పాకిస్తాన్‌లోని వివిధ సిక్కు పవిత్ర స్థలాలకు తీసుకెళ్లే జాతాలో భాగంగా ఆయన కూడా పాకిస్తాన్‌కి వెళ్లారు. ఆ సందర్భంగా ఈ పర్యటనకు సంబంధించి వీడియోలు షేర్‌ చేశారు. అయితే ఒక వీడియోలో మాత్రం రైల్వేస్టేషన్‌లో పాకిస్తాన్‌ పోలీసుల్ని కౌగింలించుకున్నట్టు కనిపిస్తుంది. పోలీసులతో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న మరో పాకిస్తానీ అధికారిని జస్బిర్‌ సింగ్‌ పలకరించడానికి ప్రయత్నిస్తాడు. ఈ వీడియోకు ‘పాకిస్తానీ పోలీస్‌ డా పియార్‌ (పాకిస్తానీ పోలీసుల ప్రేమ)’ అని క్యాప్షన్‌ పెట్టారు. ఈ వీడియోల ఆధారంగా జస్బిందర్‌సింగ్‌ను అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా పాకిస్తాన్‌కు గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో గతంలో అరెస్టు చేసిన యూట్యూబర్‌ జ్యోతి మల్హొత్రాతో జస్బీర్‌ సింగ్‌కు సన్నిహత సంబంధాలు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. జస్బిందర్‌ సింగ్‌ను పంజాబ్‌లోని రూప్‌నగర్‌ జిల్లాలోని మహ్లాన్‌ గ్రామంలో నివసిస్తున్నారు. పాకిస్తాన్‌ హైకమిషన్‌ అధికారిగా బహిష్కరించబడిన పాకిస్తాన్‌ జాతీయుడు ఎహ్సాన్‌, ఉర్‌- రహీం అలియాస్‌ డానిష్‌తో కూడా అతను సంబంధాలు కొనసాగించినట్టు డీజీపీ గౌరవ్‌ యాదవ్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -