Thursday, December 18, 2025
E-PAPER
Homeతాజా వార్తలుపాతబస్తీ నేపథ్యంలో 'జమాన'

పాతబస్తీ నేపథ్యంలో ‘జమాన’

- Advertisement -

సూర్య శ్రీనివాస్‌, సంజీవ్‌ కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జమాన’. భాస్కర్‌ జక్కుల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తేజస్వి అడప, బొద్దుల లక్ష్మణ్‌, శివకాంత్‌, శశికాంత్‌ నిర్మాతలు. ఈ చిత్ర ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు భాస్కర్‌ జక్కుల మాట్లాడుతూ,’ఈ సినిమా డిఫరెంట్‌గా ఉంటుంది. మంచి థ్రిల్లర్‌ సబ్జెక్ట్‌తో ఈ సినిమా తీశాం. ఆద్యంతం వినోదంతో పాటు ఊహించని ట్విస్ట్‌లు ఈ సినిమాలో ఉంటాయి’ అని తెలిపారు. ‘ఈ సినిమాను దర్శకుడు భాస్కర్‌ చాలా గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ ప్లేతో నడిపించారు. సినిమా తప్పకుండా అందరిని అలరిస్తుందని నమ్ముతున్నాను’ అని నిర్మాత శివకాంత్‌ చెప్పారు.

హీరో సూర్య శ్రీనివాస్‌, సంజీవ్‌ కుమార్‌ మాట్లాడుతూ,’కష్టపడి చేసిన ఈ సినిమా జనవరి 30న థియేటర్స్‌లో విడుదల కాబోతోంది. ఈ సినిమా మీ అందరికి నచ్చుతుందని నమ్ముతున్నాం’ అని అన్నారు. ‘నేటి యువతరం ఆలోచనలకు అద్దం పట్టే చిత్రమిది. హైదరాబాద్‌ పాతబస్తీ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. చక్కటి వినోదంతో ఆకట్టుకుంటుం. నేటి యూత్‌కి కనెక్ట్‌ అయ్యే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి’ అని చిత్రయూనిట్‌ తెలిపింది. స్వాతి కశ్యప్‌, జారా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జగన్‌ ఏ, ఎడిటింగ్‌: ఎం.ఆర్‌.వర్మ, సంగీతం: కేశవ కిరణ్‌, రచన-దర్శకత్వం: భాస్కర్‌ జక్కుల.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -