నవతెలంగాణ – హైదరాబాద్ : అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఆవిష్కరణ ఆధారిత హెల్త్కేర్ కంపెనీ అయిన జైడస్ లైఫ్సైన్సెస్ లిమిటెడ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క సిఫార్సులకు అనుగుణంగా భారతదేశంలో మొదటిసారిగా ప్రవేశపెట్టిన ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా (ఫ్లూ) వ్యాక్సిన్, వాక్సిఫ్లూ ఈరోజు విడుదల చేసినట్లు వెల్లడించింది. ప్రతి సంవత్సరం సీజనల్ ఇన్ఫ్లుయెంజా పరంగా ముఖ్యమైన ప్రపంచ ఆరోగ్య సమస్యగా ఫ్లూ నిలుస్తూనే ఉంది, దీని వలన 3–5 మిలియన్ల తీవ్రమైన అనారోగ్య కేసులు సంభవిస్తున్నాయి. అంతేకాదు, దీనితో సంవత్సరానికి 290,000 నుండి 650,000 శ్వాసకోశ మరణాలు సంభవిస్తున్నాయి. ఈ వ్యాధి శిశువులు, వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్య పరిస్థితులు ఉన్న వ్యక్తులను అధికంగా ప్రభావితం చేస్తుంది.
సీజనల్ ఇన్ఫ్లుయెంజా వైరస్ లు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి, ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క GISRS వంటి ప్రపంచ నిఘా వ్యవస్థలచే మార్గనిర్దేశం చేయబడిన టీకా కూర్పులకు వార్షిక నవీకరణలు అవసరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ , సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) వంటి సంస్థలు నిఘా మరియు టీకా లభ్యతను బలోపేతం చేయడానికి ప్రయత్నించినప్పటికీ, కవరేజ్ మాత్రం చెప్పుకోతగ్గ స్థాయిలో లేదు. సంసిద్ధత , సమానమైన రీతిలో టీకా పంపిణీని మెరుగుపరచడం వంటివి ఇన్ఫ్లుయెంజా వల్ల ప్రపంచంపై పడుతున్న భారాన్ని తగ్గించడానికి కీలకం.
ట్రైవాలెంట్ వ్యాక్సిన్కు మారడం గురించి డాక్టర్ పర్వైజ్ కౌల్ – FRCP (పల్మనరీ మెడిసిన్) (రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్, లండన్), FERS (ఫెలో ఆఫ్ యూరోపియన్ రెస్పిరేటరీ సొసైటీ) మాట్లాడుతూ, “సీజనల్ ఇన్ఫ్లుయెంజా మరియు దాని సమస్యలకు వ్యతిరేకంగా ఇన్ఫ్లుయెంజా టీకా ఇప్పటికీ అత్యంత ప్రభావవంతమైన నివారణ చర్యగా నిలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ క్వాడ్రివాలెంట్ మరియు ట్రైవాలెంట్ ఫార్ములేషన్లుగా అందుబాటులో ఉంది. మార్చి 2020 నుండి ఇన్ఫ్లుయెంజా వైరస్ వ్యాప్తి యొక్క ప్రపంచ నమూనాను బట్టి, ఇన్ఫ్లుయెంజా బి/ యమగట వైరస్ వ్యాప్తి లేకుండా వుంది, డబ్ల్యుహెచ్ఓ , సిడిసి మొదలైన ప్రపంచ నియంత్రణ సంస్థలు బి/యమగట ఇకపై వ్యాక్సిన్ ఫార్ములేషన్లో భాగంగా ఉండకూడదని స్పష్టంగా సిఫార్సు చేశాయి. యుఎస్ తో సహా దాదాపు 40 దేశాలు ఇప్పటికే ట్రైవాలెంట్ వ్యాక్సిన్ను స్వీకరించాయి. ఈ పరిస్థితులలో, ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఉపయోగం కోసం అత్యంత శాస్త్రీయ సూత్రీకరణ గా నిలిచింది. భారతదేశం నుండి కూడా ఇన్ఫ్లుయెంజా బి /యమగట నివేదించబడలేదు. అందుచేత ట్రై వాలెంట్ ఫార్ములేషన్ స్పష్టంగా ముందుకు సాగే మార్గంగా నిలిచింది. గత 5 సంవత్సరాలుగా చెలామణిలో లేని వైరస్కు వ్యతిరేకంగా టీకాలు వేయడంలో అర్థం లేదు” అని అన్నారు.
నివారణ ఆరోగ్యాన్ని పెంచాల్సిన అవసరం గురించి జైడస్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ షార్విల్ పటేల్ మాట్లాడుతూ, “మనం అనేక అంటు వ్యాధులతో పోరాడుతున్న సమయంలో మంచి శ్రేయస్సు మరియు ఆరోగ్యానికి టీకాలు చాలా అవసరం. ప్రపంచ మార్గదర్శకాలకు అనుగుణంగా, టీకాలను సకాలంలో అందుబాటులో ఉంచటంను మేము విశ్వసిస్తున్నాము, ఎందుకంటే అవి నివారణ ఆరోగ్య సంరక్షణలో కీలకమైన భాగం. ఇది అధిక-ప్రమాద సమూహాలలో వ్యాక్సిన్ నివారించగల వ్యాధులు , సంబంధిత సమస్యలను గణనీయంగా తగ్గిస్తుందని మేము విశ్వసిస్తున్నాము” అని అన్నారు.
ఉత్తర అర్ధగోళం (NH) స్ట్రెయిన్స్ కు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క 2025–26 సిఫార్సుల ప్రకారం, మార్చి 2020 నుండి సహజంగా సంభవించే బి /యమగుట వంశ వైరస్లు లేకపోవడం సంక్రమణ ప్రమాదాన్ని చాలా తక్కువగా సూచిస్తుంది. తత్ఫలితంగా, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్లలో ఈ జాతిని చేర్చడం ఇకపై అవసరంగా పరిగణించబడదు. దీనికి అనుగుణంగా, భారత ప్రభుత్వంలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) కూడా NH 2025 – 26 సీజన్లో ఉపయోగించడానికి ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ను ఉపయోగించాలని సిఫార్సు చేసింది.