Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలు సైకిల్ ను ఢీ కొట్టిన టిప్పర్.. బాలిక మృతి

 సైకిల్ ను ఢీ కొట్టిన టిప్పర్.. బాలిక మృతి

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవంగర: సైకిల్ ను టిప్పర్ ఢీ కొట్టడంతో ఓ బాలిక మృతి చెందిన సంఘటన పెద్దవంగర మండలంలోని కిష్టు తండా శివారులో ఆదివారం జరిగింది. ఎస్సై క్రాంతి కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం… తండాకు చెందిన జాటోత్ సోమన్న -అనిత దంపతులకు ఇందుమతి (11), దీక్షిత్ ఇద్దరు సంతానం. దంపతులిద్దరూ తండలో తమకున్న కొద్దిపాటి పొలం సాగు చేసుకుంటూ భార్య పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నారు. ఇందుమతి తొర్రూరు లోని ఓ ప్రయివేట్ పాఠశాలలో ఐదవ తరగతి పూర్తిచేసింది. రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండడంతో సైకిల్ పై ఆమె సర్వీసు రోడ్డు మీదుగా దుర్గమ్మ ఆలయానికి వెళ్తుండగా, వెనుకనుండి టిప్పర్ ఢీ కొట్టింది. దీంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో ఇందుమతి అక్కడికక్కడే మృతి చెందింది. తొర్రూరు సీఐ గణేష్, ఎస్సై ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు టిప్పర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad