తెలంగాణలో తొలిరోజే 100 నామినేషన్లు..

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది.119 నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. నామినేషన్ ప్రక్రియలో మొదటి రోజున 100 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు మొదటిరోజు పలుచోట్ల నామినేషన్లు వేశారు. మరోవైపు అధికార బీఆర్ఎస్ ఖాతా తెరవలేదు. తొలిరోజు నామినేషన్లలో అధికంగా స్వతంత్ర అభ్యర్థులవే ఉన్నాయి. అక్కడక్కడ చిన్న పార్టీలకు చెందిన అభ్యర్థులూ నామినేషన్లు దాఖలు చేశారు. గత నెల 9వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. శుక్రవారం రోజున ఎన్నికల కమిషన్ నోటీఫికేషన్ జారీ చేయగా నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. కాంగ్రెస్‌ నుంచి 8 మంది, బీజేపీ నుంచి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వీరితో పాటు మరికొంత మంది స్వతంత్ర అభ్యర్థులు, చిన్న పార్టీలకు చెందిన అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు.

Spread the love