నవతెలంగాణ – హైదరాబాద్ : తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్కు బెంగళూరు స్పెషల్ కోర్టు 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది. అతనితో పాటు ఈ కేసులో ఇతర నిందితులను జులై 4 వరకు జుడీషియల్ కస్టడీకి పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దర్శన్, నటి పవిత్ర గౌడతో పాటు పలువురు నిందితులను ఈ నెల 11న పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.