
జుక్కల్ మండలంలో 17. 8 మీ.మీ వర్ష పాతం నమేాదు అయిందని జుక్కల్ ఎంఆర్ఐ రామ్ పటేల్ తెలిపారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ.. గ్రామాలలో పాత ఇండ్లలో నివాసం ఉండే వారు. ఇంటిన మార్చుకోవాలని విఙ్ఞప్తి చేస్తున్నామని, పాత గోడలు, ఇండ్లు వర్షం ధాటికి నానిపోయి, కూలిపోతే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్త వహించాలని తెలిపారు.