లింగ నిర్దారణ పరీక్షలు చేస్తున్న 18 మంది అరెస్ట్‌

నవతెలంగాణ-మట్టెవాడ
ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తూ అక్రమంగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న 18మందిని అరెస్ట్‌ చేసినట్లు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ తెలిపారు. ఆదివారం పోలీసులు తమదైన శైలిలో కొనసాగించిన స్ట్రింగ్‌ ఆపరేషన్‌ అక్రమ గర్భనిర్ధారణ పరీక్షలు చేయడమే కాకుండా గర్భస్రావాలు చేస్తున్న ముఠాను పట్టుకున్న నేపథ్యంలో సీపీ కార్యాలయంలో ఏర్పాటు సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరంగల్‌లోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో యథేచ్చగా లింగనిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయని, ఆయా ఆసుపత్రులపై పోలీసులకు పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో వాటి గుట్టురట్టు చేయాలన్న ఆలోచనతో పోలీసులు ఆయా ఆస్పత్రులపై నిఘా పెట్టినట్లు పేర్కొన్నారు. పోలీసులు జరిపిన రహస్య విచారణలో లింగనిర్ధారణ ద్వారా గర్భస్రావాలు చేస్తున్న 18 మం దిని ప్రత్యక్షంగా పట్టుకొని అరెస్టు చేసినట్లు సీపీ రం గనాథ్‌ పేర్కొన్నారు. వీరి నుంచి 18సెల్‌ఫోన్లు, రూ. 73 వేలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. లింగ నిర్ధారణ ద్వారా గర్భస్రా వాలు చేస్తున్న లోటస్‌ ఆసుపత్రి యజమానితో పాటు వైద్యులను అరెస్టు చేశామని ఆయన తెలిపారు. నర్సంపేట కేంద్రంగా పెద్ద ఎత్తున ఈ బ్రుణహత్యల దందా జరుగుతోందన్నారు. ఆయుర్వేద వైద్యులు కూడా గర్భస్రావాలు చేస్తున్నారని తెలిపారు. ఈ చర్యలకు పాల్పడుతున్న వైద్యు లు, సిబ్బంది అందరినీ పట్టుకుంటామని స్పష్టం చేశారు. గర్భస్రావాల కోసం ఒక్కొక్కరి నుంచి రూ.30 వేలు వసూలు చేస్తున్నట్లు తమ పరిశీలనలో తేలిందని సీపీ పేర్కొన్నారు. త్వరలోనే వైద్యశాఖ అధి కారులతో సమావేశం ఏర్పాటు చేసి తగుచర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు.

Spread the love