పెద్దచెరువుకు రూ.47లక్షలు మంజూరు

నవతెలంగాణ – చిన్నకోడూరు 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ అభివృద్ధికి, చెరువుల మరమ్మతుకు కృషి చేస్తుందని సర్పంచ్ల ఫోరం చిన్నకోడూరు మండల అధ్యక్షుడు కాముని ఉమేష్ చంద్ర పేర్కొన్నారు. మండల కేంద్రమైన చిన్నకోడూరు లోని పెద్ద చెరువు మరమ్మత్తుల కోసం మంత్రి హరీష్ రావు రూ.47 లక్షల రూపాయలను మంజూరు చేసారని తెలిపారు. నిధులు మంజూరు చేసిన మంత్రి హరీష్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని చిన్నకోడూరు సర్పంచ్ ఉమేష్ చంద్ర తెలిపారు.

Spread the love