కుప్పకూలిన విమానం..9 మంది మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : సుడాన్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం సభవించింది. సాంకేతిక లోపంతో విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. మృతుల్లో నలుగురు సైనికులు ఉన్నారు. ఈ విషయాన్ని ఆ దేశ సైన్యం ధ్రువీకరించింది. పౌరులతో వెళ్తున్న విమానం టేకాఫ్‌ సమయంలో సాంకేతిక లోపం తలెత్తి కూలినట్లు వెల్లడించింది. మృతుల్లో నలుగురు సైనిక సిబ్బంది ఉన్నారని చెప్పింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృత్యుంజయురాలిగా బయటపడిందని తెలిపింది. ఈ ఘటన జరిగిన వెంటనే సహాయక బృందాలు ఆ ప్రాంతానికి చేరి రక్షణ చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను బయటకు తీసి ఆస్పత్రికి తరలించాయి.

Spread the love