ముగ్గురిపై వేధింపుల కేసు నమోదు

నవతెలంగాణ – అశ్వారావుపేట
అదనపు కట్నం కోసం  వేధింపులకు పాల్పడుతున్న  ముగ్గురిపై శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక ఎస్.హెచ్.ఒ ఎస్ఐ పీ.శ్రీకాంత్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పేరాయిగూడెం కు చెందిన తగరం అనంత దేవికి ఇదే గ్రామానికి చెందిన వినోద్ కుమార్ తో సుమారు మూడేళ్ల క్రితం వివాహం అయింది. గడిచిన కొంతకాలంగా అనంతదేవిని అదనపు కట్నం కోసం భర్త వినోద్  శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. దాంతో తనను వేధింపులకు గురిచేస్తున్న భర్తతో పాటు, మామ తగరం సత్యనారాయణ, అత్తయ్య వెంకట రమణపై అనంతదేవి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Spread the love