వాహనాలను ఢీ కొట్టిన కంటైనర్‌ లారీ..

నవతెలంగాణ-హైదరాబాద్ : ఆదిలాబాద్‌  జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కంటైనర్ లారీ రెండు వాహనాలను ఢీ కొట్టడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన హత్నూర్‌ మండలం సీతగొంది వద్ద గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. హైదరాబాద్‌ నుంచి ఆదిలాబాద్‌ వెళ్తున్న బోర్‌వెల్ వాహనాన్ని వెనుక నుంచి కంటైనర్‌ లారీ ఢీ కొట్టింది. దీంతో బోర్‌వెల్‌ వాహనం బోల్తాపడింది. ఈ క్రమంలో కంటైనర్‌ లారీ ఆదిలాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న మరో లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆదిలాబాద్‌ రిమ్స్‌ దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love