మటన్‌ కోసం గోడవ… వ్యక్తి దారుణ హత్య

నవతెలంగాణ హైదరాబాద్: మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన సికింద్రాబాద్‌ తుకారాం గేటు పీఎస్‌ పరిధిలో చోటుచేసుకుంది. గోల్‌బాయ్‌ బస్తీకి చెందిన చారి, అజయ్‌కి మధ్య మటన్‌ తినే విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. అప్పటికే ఇద్దరు మద్యం బాగా తాగేసి మత్తులో ఉండటంతో గొడవ మరింత పెద్దదిగా మారింది. ఈ క్రమంలో అజయ్‌ కత్తితో చారిపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుణ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Spread the love