విశాఖలో అపార్ట్మెంట్ పై నుంచి దూకి ప్రేమ జంట ఆత్మహత్య

నవతెలంగాణ – హైదరాబాద్: ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడిన హృదయ విదారక ఘటన గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్కిరెడ్డిపాలెంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అమలాపురం‌ ప్రాంతానికి చెందిన పిల్లి దుర్గారావు, సాయి సుష్మిత కుటుంబాలు బతుకుదెరువు కోసం వలస వచ్చి షీలానగర్ ప్రాంతంలోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్నాయి. ఈ క్రమంలోనే సుష్మిత, దుర్గారావుకు మధ్య పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. తాజాగా, తమ ఇళ్లలో పెళ్లి ప్రస్తావన తీసుకురాగా.. ఇరు కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన వారు ఓ అపార్ట్‌మెంట్ పైనుంచి దూకేశాడు. ఈ దుర్ఘటనలో దుర్గారావు, సుష్మిత అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. కాలనీవాసుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love