రైలు కింద పడి వ్యక్తి మృతి..

నవతెలంగాణ – మోర్తాడ్
మండల కేంద్రమైన రైల్వే స్టేషన్ పరిధిలో గూడ్స్ రైలు ఢీకొని ఒకరు మృతి చెందినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ హనుమాన్లు తెలిపారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మోర్తాడ్ చెందిన పాల్ది సంతోష్ (20) తన స్నేహితుడితో ఉదయం సమయంలో పట్టాలపై వెళ్తుండగా నిజామాబాదు నుండి కరీంనగర్ వెళ్తున్న గూడ్స్ రైలు ఢీకొనడంతో సంతోష్ మృతి చెందినట్లు తెలిపారు. గూడ్స్ రైలు వస్తున్న వాటిని గమనించకపోవడంతో సంతోష్ కాలికి బలమైన గాయాలు మృతి చెందగా అతని స్నేహితుడు గాయాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ప్రజలు ఎవరు కూడా పట్టాలపై నడవడం గాని మద్యం సేవించడం లాంటి పనులు చేయకూడదని తెలిపారు. కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజాంబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
Spread the love