– ఉన్నతాధికారులకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
విద్యార్థులకు పోషకాహారం అందేలా డైట్లో మార్పులు, చేర్పులు చేయాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులకు సూచించారు. పది రోజుల్లో కొత్త డైట్ను అందుబాటులోకి తీసుకురావాలని వారిని ఆదేశించారు. ప్రభుత్వ వసతిగృహ విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచిన నేపథ్యంలో ముఖ్యమంత్రికి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, వివిధ సంక్షేమ విభాగాల సెక్రెటరీలు కృతజ్ఞతలు తెలిపారు. దీపావళి కానుకగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వసతిగృహాలు, తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని వసతిగృహాల్లో డైట్ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. డైట్ చార్జీల పెంపు విషయంలో కమిటీ ప్రతిపాదనను యథావిధిగా అమలు చేయడంపై ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేశారు. పెంచిన డైట్, కాస్మోటిక్ చార్జీలతో 7,65,705 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనున్నది.