ఒలింపిక్ గేమ్స్ లో క్రికెట్ కు చోటు..

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రపంచంలో ఒలింపిక్ గేమ్స్ కు ఎంత విశిష్టమైన చరిత్ర ఉందో తెలిసిందే. 128 సంవత్సరాలుగా ఒలింపిక్ జరుగుతూ వచ్చాయి. అయితే ఈ ఒలింపిక్ లో కొన్ని గేమ్స్ చోటు దక్కించుకోవడంలో విఫలం అయ్యాయి. అలాంటి వాటిలో ఒకటి క్రికెట్. ఈ రోజుల్లో ఫుట్ బాల్ తర్వాత అంతటి ప్రాముఖ్యతను దక్కించుకున్న ఆట ఏదైనా ఉంది అంటే అది క్రికెట్. తాజాగా తెలుస్తున్న ప్రకారం రానున్న ఒలింపిక్ గేమ్స్ 2028 లో క్రికెట్ మరియు స్క్వాష్ గేమ్స్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఇది నిజంగా చాలా సంతోషపడే విషయం అని చెప్పాలి. ఈ విషయాన్ని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ ప్రకటించారు. ఈ ఒలింపిక్ గేమ్స్ లో కొత్తగా చేరనున్న అయిదు గేమ్స్ ను ప్రవేశ పెట్టగా అందులో క్రికెట్ కూడా భాగం కావడం హర్షణీయం అన్నారు.

Spread the love