మెప్పించే చక్రవ్యూహం

అజరు ప్రధాన పాత్రలో నటించిన మర్డర్‌ మిస్టరీ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘చక్రవ్యూహం’ -ది ట్రాప్‌ అనేది ఉపశీర్షిక. చెట్కూరి మధుసూదన్‌ దర్శకుడు. సహస్ర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సావిత్రి నిర్మించిన ఈ చిత్రం జూన్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో డైరెక్టర్‌ మధుసూదన్‌ మాట్లాడుతూ,’ ఇప్పటికే విడుదల అయిన ఫస్ట్‌లుక్‌, టీజర్‌, ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తుంది. అలాగే సినిమాకి కూడా అని థియేటర్స్‌లో ఇదే విధంగా రెస్పాన్స్‌ వస్తుందనే ఆశాభావంతో ఉన్నాం. ట్రైలర్‌ విడుదల చేసిన హీరో సాయిధరమ్‌ తేజ్‌కి ధన్యవాదాలు. యూట్యూబ్‌లో మిలియన్‌ వ్యూస్‌తో ఈ చిత్ర ట్రైలర్‌ దూసుకెళ్తోంది. జూన్‌ 2న ప్రేక్షకులు థియేటర్స్‌లోనే సినిమా చూసి ఆదరించాలని కోరుతున్నాను’ అని తెలిపారు. ‘మధుసూధన్‌ సినిమాని తీసిన తీరు నాకెంతో నచ్చింది. స్క్రీన్‌ ప్లే, కథ పై తనకి మంచి కమాండ్‌ ఉంది. ఈ సినిమా అందరికి నచ్చుతుంది’ అని అజరు అన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్న మైత్రీ మూవీస్‌ డిస్ట్రిబ్యూషన్‌ శశిధర్‌ రెడ్డి మాట్లాడుతూ,’కథ వినగానే నచ్చి కొన్నాం. ఇప్పడు డైరెక్టర్‌ తీసిన సినిమా చూశాక 100 శాతం సినిమా సక్సెస్‌ అవుతుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం ప్రేక్షకులు కోరుకుంటున్న రీతిలోనే ఈ సినిమా ఉంది. అందర్నీ మెప్పిస్తుంది’ అని చెప్పారు. ఈ వేడుకలో శశిధర్‌ రెడ్డి చేతులు మీదుగా చిత్ర యూనిట్‌ అంతా కలిసి బిగ్‌ టికెట్‌ని ఆవిష్కరించారు.

Spread the love