నవతెలంగాణ – హైదరాబాద్: ఏపీలోని విజయవాడకు చెందిన జయ బాదిగకు అగ్రరాజ్యం అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంట్ కౌంటీ సుపీరియర్ కోర్టు జడ్జిగా ఆమె నియమితులయ్యారు. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి కాలిఫోర్నియాలో జడ్జిగా బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తిగా జయ నిలిచారు. 2022 నుంచి ఇదే కోర్టులో కమీషనర్గా కొనసాగుతున్న ఆమె..హైదరాబాద్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం అమెరికా వెళ్లిన ఆమె బోస్టన్ విశ్వవిద్యాలయంలో ఎంఏ పూర్తి చేశారు. 10 ఏళ్లకు పైగా న్యాయవాద వృత్తిలో ప్రైవేట్ ప్రాక్టీస్లో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో లాభాపేక్ష లేకుండా పలు కేసుల్లో ప్రభుత్వం తరఫున వాదించిన ఘనత ఆమె సొంతం. అలాగే మెక్జార్జ్ స్కూల్ ఆఫ్ లాలో సహయక అధ్యాపకురాలిగాను పని చేశారు.