బట్టల షాప్​లో ఘోర అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి

నవతెలంగాణ హైదరాబాద్: మహారాష్ట్ర ఔరంగాబాద్ జిల్లాలోని ఓ వస్త్ర దుకాణంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. బుధవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ ఉన్నట్టు సమాచారం. మిగతావారి ఆచూకీ లభించాల్సి ఉంది. శవపరీక్షల నిమిత్తం మృతదేహాలను జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కంటోన్మెంట్​ ప్రాంతంలోని జైన దేవాలయం సమీపంలో ఉన్న ఓ మూడంతస్తుల భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
బుధవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న సంబంధిత శాఖల అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షించారు. మాకు సహాయంగా స్థానికులు కూడా ఓ చేయి కలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నాం. విచారణ జరుగుతోంది. దర్యాప్తులో అగ్నిప్రమాదానికి గల కారణమేమిటో తెలుస్తుందని స్థానిక పోలీసులు తెలిపారు.

Spread the love