అడవిలో 16 కి.మీ కాలినడకన వచ్చి ఓటు వేసిన గ్రామం

నవతెలంగాణ ములుగు: ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం లాంటి ఓటు మాత్రమే తమ భవిష్యత్తును నిర్ణయిస్తోందని  16 కిలో మీటర్లు అటవీ గుండా కాలినడకన వచ్చి తమ ఓటును వినియోగించుకుందో గ్రామం. వివరాల్లోకి వెళ్లితే ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు గ్రామస్తులు16 కిలో మీటర్లు అటవీ గుండా కాలినడకన వచ్చి తమ ఓటును వినియోగించుకుని ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. గ్రామంలో పోలింగ్ బూత్ లేకపోవడంతో వాజేడులో ఉన్న పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ… తమ గ్రామానికి సరైన మౌళిక వసతులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు లేక అనారోగ్యంతో వాజేడుకు వచ్చే క్రమంలో అడవి మార్గంలోనే చనిపోయిన వారు చాలా మంది ఉన్నారని ఇప్పటి వరకు ప్రభుత్వాలు మారినా మా బతుకులు మారడం లేదని విచారం వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఇకనైనా తమ బతుకులు మార్చాలని కోరారు.

Spread the love