ఘోర రోడ్డు ప్రమాదం మహిళ అక్కడికక్కడే మృతి..

నవతెలంగాణ – లింగంపేట్
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో కామారెడ్డి – ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందర సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లింగంపేట్ వైపు వెళ్తున్న ఆటోని ట్రాక్టర్ ఢీ కొనడంతో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సందర్భంగా ఎస్ ఐ మహేష్ మాట్లాడుతూ..  ఆటోలో ముగ్గురు మహిళలు ఇద్దరూ పిల్లలు ఉన్నారన్నారు. ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మృతురాలు ద్యావల లచ్చవ్వ (40)  లింగంపేట్ మండలం రాంపూర్ గ్రామనికి చెందిన వారుగా గుర్తించడం జరిగిందన్నారు.  మృతదేహన్నీ మార్చరీలో ఉంచామన్నారు. ఆటోలో మరో మహిళకూ కాలు విరగగా, ఆటో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయని క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తామని  ఎస్ ఐ మహేష్ అన్నారు. మృతురాలు భర్త గతంలొనే చనిపోవడంతో కొడుకు కూతురు అనాదలుగా మిగిలి కన్నిటిగోడు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ని చూసిన జనాలకు కంట నీరు ఆగలేని పరిస్థితి నెలకొంది.
Spread the love