ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని మతుసంగెం గ్రామంలో ఒకరు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. మతుసంగెం గ్రామానికి చెందిన నీరడి సాయిలు వయసు 46 సంవత్సరాలు, కామారెడ్డి జిల్లా అగ్రికల్చర్ కార్యాలయంలో అటెండర్ గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే  అతనికి, గుర్జాల్ గ్రామానికి చెందిన అతని మరదలు తో గతంలో గొడవలు కాగా, ఇరు కుటుంబాల బంధువులు సర్ది జెప్పి, ఎవరి జోలికి వారు పోకుండా చేసారు. తర్వాత మొన్న 31 తారీకు అట్టి మహిళ ఇంటి నుంచి చెప్పకుండా వెళ్లిపోవడంతో గాంధారి పోలీస్ స్టేషన్ నందు మహిళ తప్పిపోయినదిగా ఫిర్యాదు ఇవ్వడంతో, ఇట్టి విషయము వారి బంధువులు నన్నే అడుగుతారని భయంతో తీవ్ర మనస్థాపానికి లోనయ్యి, తన ఇంటి ముందుగల  ఇంద్ర గౌడు రేకుల షెడ్డు కు ప్లాస్టిక్ తాడుతో ఈరోజు ఉదయం నాలుగున్నర గంటలకు ప్రాంతంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్ల భార్య నీరడి విజయ  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు గాంధారి ఎస్.ఐ ఆంజనేయులు తెలిపారు.
Spread the love